ఎంబీసీ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-06T04:29:02+05:30 IST

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎంబీసీ చర్చ్‌లో మహబూబ్‌నగర్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో ఘనంగా యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడు కలు నిర్వహించారు.

ఎంబీసీ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు
క్రిస్మస్‌ కేక్‌ను పాస్టర్లతో కలిసి కట్‌ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 5 : క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎంబీసీ చర్చ్‌లో మహబూబ్‌నగర్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో ఘనంగా యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడు కలు నిర్వహించారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరై క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చే శారు. కొవ్వొత్తులు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ క్రిస్మస్‌ అంటే శాంతికి చిహ్నమని, పండగను ఎంతో గొప్పగా జరుపుకోవడం ఆనం దంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని చెప్పారు. 

Updated Date - 2021-12-06T04:29:02+05:30 IST