వివాదాస్పద స్థలంపై సీఐ విచారణ

ABN , First Publish Date - 2022-01-24T04:00:42+05:30 IST

మండలంలోని తోటలచెరువుపల్లిలో ఆలయ నిర్మాణానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన స్ధలాన్ని ఆదివారం ఉదయగిరి సీఐ గిరిబాబు పరిశీలించి ఇరు వర్గాలను విచారించారు.

వివాదాస్పద స్థలంపై సీఐ విచారణ
గ్రామస్థులతో చర్చిస్తున్న సీఐ గిరిబాబు

వరికుంటపాడు, జనవరి 23: మండలంలోని తోటలచెరువుపల్లిలో ఆలయ నిర్మాణానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన స్ధలాన్ని ఆదివారం ఉదయగిరి సీఐ గిరిబాబు పరిశీలించి ఇరు వర్గాలను విచారించారు. బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ఇటీవల గ్రామస్థులు శ్రీకారం చుట్టారు. సమీపంలోని కొంతమంది నివాసాలు, దుకాణాలు నిర్మించుకుని ఉండడంతో ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఓ నివాసానికి చెందిన వ్యక్తులు ఖాళీ చేసేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇరువర్గాల నడుమ వివాదం జరిగి పోలీస్‌ స్టేషన్‌కు చేరాయి. దీంతో గ్రామానికి చేరుకున్న ఆయన ఇరువర్గాలతో పాటు గ్రామస్థులతో చర్చించి సమస్యకు పరిష్కారించడంతో వివాదానికి తెర పడింది. ఆయన వెంట ఎస్సై బాలమహేంద్రనాయక్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-24T04:00:42+05:30 IST