24 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-08-05T11:36:06+05:30 IST
పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పోకూరులో 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.విజయకుమార్ చెప్పారు.
కందుకూరు, ఆగస్టు 4 : పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పోకూరులో 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.విజయకుమార్ చెప్పారు. పోకూరు కేంద్రంగా భారీగా గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రూరల్ ఎస్సై అంకమ్మ, వీవీపాలెం ఎస్సై హజరత్తయ్యలు దాడి చేశామన్నారు. పోకూరుకు చెందిన నాగులూరి ఆదాం, కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాదారం గ్రామానికి చెందిన నాగులూరి అంకయ్య, నాగులూరి అలివేలుమంగ గంజాయితో పట్టుబడ్డారని చెప్పారు. ఒక్కో ప్యాకెట్ బరువు 2 కిలోలు ఉందని, 12 ప్యాకెట్ల గంజాయి వారి వద్ద పట్టుబడిందని తెలిపారు. మంగళవారం నిందితులను కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు.