చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీఐడీ విచారణ

ABN , First Publish Date - 2021-04-14T06:47:26+05:30 IST

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీఐడీ విచారణ

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 13: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2015నుంచి 2018 వరకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణతో పాటు మరమ్మతుల కాంట్రాక్టును టీబీఎస్‌ ఏజెన్సీకి ఇచ్చారు. వెంటిలేటర్‌ నుంచి బీపీ మెషిన్‌ వరకు మొత్తం 178 పరికరాల నిర్వాహణ, మరమ్మతుల బాధ్యత ఈ ఏజెన్సీకి అప్పగించారు. ఇందుకోసం పరికరాల విలువలో 3నుంచి 5శాతం సర్వీసు చార్జీలు వసూలు చేసేవారు. అయితే ఆస్పత్రుల్లో లేని పరికరాలను ఉన్నట్లు, వాటికి సర్వీసులు చేసినట్లు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయల క్లయిమ్‌ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పలు రికార్డులను తనిఖీ చేశారు. ఏజెన్సీ పెట్టిన బిల్లులోని అంశాలు, ఆస్పత్రిలోని పరికరాలు, వాటి విలువ, సర్వీసులకు అయ్యే ఖర్చులను పరిశీలించారు. 

Updated Date - 2021-04-14T06:47:26+05:30 IST