ఆస్పత్రుల్లో సీఐడీ బృందం తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-16T05:11:34+05:30 IST

నరసన్నపేట సీహెచ్‌సీతోపాటు మాకివలస పీహెచ్‌సీలో, మెళియాపుట్టి మండలంలోని మెళియాపుట్టి, చాపర, కరజాడలోని ఆరోగ్య కేంద్రాల్లో గురువారం సీఐడీ బృందం తనిఖీలుచేసింది

ఆస్పత్రుల్లో సీఐడీ బృందం తనిఖీలు
నరసన్నపేట సీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

నరసన్నపేట/ మెళియాపుట్టి: నరసన్నపేట సీహెచ్‌సీతోపాటు మాకివలస పీహెచ్‌సీలో, మెళియాపుట్టి మండలంలోని  మెళియాపుట్టి, చాపర, కరజాడలోని ఆరోగ్య కేంద్రాల్లో గురువారం  సీఐడీ బృందం తనిఖీలుచేసింది. అడిషనల్‌ డీజీ ఆదేశాల మేరకు సీఐడీ సీఐ భవానీప్రసాద్‌ ఆధ్వర్యంలో 2015 నుంచి 2018 వరకు కొనుగోలుచేసిన పరికరాలు, బయోమెడికల్‌ పరికరాల వినియోగం, రికార్డులను పరిశీలించారు. పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని భవానీప్రసాద్‌ చెప్పారు. తనిఖీల్లో ఎస్‌ఐలు చంద్రమౌళి,నాగరాజు, వైద్యాధికారులు  దినేష్‌, గణపతిరావు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-04-16T05:11:34+05:30 IST