పల్ల వెంకన్న నర్సరీలో ‘కోతి బావకు పెళ్ళంట’

ABN , First Publish Date - 2021-12-01T05:37:37+05:30 IST

ప్రముఖ సినీనటుడు ఆలీ హీరోగా తెరకెక్కుతున్న ‘కోతిబావకు పెళ్ళంట’ చిత్ర షూటింగ్‌ మంగళవారం పల్ల వెంకన్న నర్సరీలో జరిగింది.

పల్ల వెంకన్న నర్సరీలో ‘కోతి బావకు పెళ్ళంట’
పల్ల వెంకన్న నర్సరీలో కోతిబావకు పెళ్లంట చిత్ర సందడి

కడియం, నవంబరు 30: ప్రముఖ సినీనటుడు ఆలీ హీరోగా తెరకెక్కుతున్న ‘కోతిబావకు పెళ్ళంట’ చిత్ర షూటింగ్‌ మంగళవారం పల్ల వెంకన్న నర్సరీలో జరిగింది. దర్శకునిగా అశోక్‌కుమార్‌ వ్యవహరిస్తుండగా, బ్రహ్మానందం, సునీల్‌, తనికెళ్ళభరణి, గౌతంరాజు నటిస్తున్నట్లు  కో-ప్రొడ్యూసర్‌ మురళీకృష్ణ తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలో పాటలు, సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు.  బుల్లితెర నటి శ్రీకరుణ, ఆలీ జంటగా ఓ పాటను చిత్రీకరించారు. డిసెంబరు 1వ తేదీన ఆత్రేయపురంలో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.  పల్ల వెంకన్నకు ఆలీ నివాళులర్పించారు. 

Updated Date - 2021-12-01T05:37:37+05:30 IST