పల్ల వెంకన్న నర్సరీలో ‘కోతి బావకు పెళ్ళంట’
ABN , First Publish Date - 2021-12-01T05:37:37+05:30 IST
ప్రముఖ సినీనటుడు ఆలీ హీరోగా తెరకెక్కుతున్న ‘కోతిబావకు పెళ్ళంట’ చిత్ర షూటింగ్ మంగళవారం పల్ల వెంకన్న నర్సరీలో జరిగింది.
కడియం, నవంబరు 30: ప్రముఖ సినీనటుడు ఆలీ హీరోగా తెరకెక్కుతున్న ‘కోతిబావకు పెళ్ళంట’ చిత్ర షూటింగ్ మంగళవారం పల్ల వెంకన్న నర్సరీలో జరిగింది. దర్శకునిగా అశోక్కుమార్ వ్యవహరిస్తుండగా, బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ళభరణి, గౌతంరాజు నటిస్తున్నట్లు కో-ప్రొడ్యూసర్ మురళీకృష్ణ తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలో పాటలు, సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. బుల్లితెర నటి శ్రీకరుణ, ఆలీ జంటగా ఓ పాటను చిత్రీకరించారు. డిసెంబరు 1వ తేదీన ఆత్రేయపురంలో షూటింగ్కు సన్నాహాలు చేస్తున్నారు. పల్ల వెంకన్నకు ఆలీ నివాళులర్పించారు.