స్థానిక భాషల్లో ప్రావీణ్యమున్న వారినే నియమిస్తాం
ABN , First Publish Date - 2020-08-13T07:40:00+05:30 IST
ఇటీవల చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఎంకె పార్లమెంట్ సభ్యురాలు కనిమొళికి ఎదురైన అనుభవంతో సీఐఎ్సఎఫ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది...
- ఎయిర్పోర్టుల్లో సిబ్బందిపై సీఐఎ్సఎఫ్ ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇటీవల చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఎంకె పార్లమెంట్ సభ్యురాలు కనిమొళికి ఎదురైన అనుభవంతో సీఐఎ్సఎఫ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇక నుంచి విమానాశ్రయాల్లో స్థానిక భాషను తెలిసిన ఉద్యోగులనే నియమించనున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనిమొళి పేర్కొన్నట్టుగా ఆ మహిళా అధికారి అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించలేదని విచారణలో తేలిందన్నారు.