కొండవీడును సందర్శించిన సిట్ డీఐజీ
ABN , First Publish Date - 2021-01-18T05:12:29+05:30 IST
కొండవీడు ప్రపంచ పర్యాటకులకు అనువైన ప్రాంతం అని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) టీమ్ లీడర్, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అన్నారు.
చిలకలూరిపేట, జనవరి 17: కొండవీడు ప్రపంచ పర్యాటకులకు అనువైన ప్రాంతం అని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) టీమ్ లీడర్, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా కొండవీడును సందర్శించారు. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కోట చారిత్రక విశిష్టతను తెలియజేశారు. కొండపై చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.