నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
ABN , First Publish Date - 2020-09-19T09:21:26+05:30 IST
ఆర్టీసీ సిటీ బస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కనున్నాయి. మార్చి 23న లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు శనివారం నుంచి ప్రయాణికులను అందుబాటులోకి రాన్నాయి.
తొలివిడతగా 110 సర్వీసులు ప్రారంభ ం
ప్రయాణికుల సంఖ్య ఆధారంగా దఫదఫాలుగా పెంపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ సిటీ బస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కనున్నాయి. మార్చి 23న లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు శనివారం నుంచి ప్రయాణికులను అందుబాటులోకి రాన్నాయి. ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు ఆదేశాల మేరకు విశాఖ రీజియన్ అధికారులు తొలివిడత 110 సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించారు.
తాజాగా ప్రారంభించే సర్వీసులకు లభించే ఆదరణను బట్టి ఆదివారం మరిన్ని సర్వీసులను పెంచాలా? అక్కర్లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సిటీ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ సుధాబిందు తెలిపారు. శనివారం ప్రారంభించే సిటీ బస్సులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అనకాపల్లి, గాజువాక, భీమిలి, పెందుర్తి, ఎస్.కోట వంటి ప్రాంతాలకు నడుస్తాయని, మరికొన్ని రైల్వేస్టేషన్ నుంచి టౌన్ కొత్తరోడ్డు, బీచ్రోడ్డు, కొత్తవలస రూట్లలోనూ, మిగిలినవి ఆయా డిపోల నుంచి ప్రధాన రూట్లలో పాత షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని ఆమె వివరించారు.