సచివాలయాల్లో పౌర సేవలు సజావుగా జరగాలి

ABN , First Publish Date - 2020-05-27T09:12:38+05:30 IST

వార్డు సచివాలయాలకు కేటాయించిన జాబ్‌చార్ట్‌లోని అంశాలపై వార్డు పరిపాలన కార్యదర్శులు పట్టు సాధించాలని..

సచివాలయాల్లో పౌర సేవలు సజావుగా జరగాలి

జీవీఎంసీ కమిషనర్‌ సృజన


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): వార్డు సచివాలయాలకు కేటాయించిన జాబ్‌చార్ట్‌లోని అంశాలపై వార్డు పరిపాలన కార్యదర్శులు పట్టు సాఽధించాలని జీవీఎంసీ కమిషర్‌ డాక్టర్‌ జి.సృజన ఆకాంక్షించారు. స్వర్ణభారతి స్టేడియంలో జరుగుతున్న వార్డు సచివాలయం పరిపాలన కార్యదర్శుల అవగాహన సదస్సును మంగళవారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా కమిషనర్‌ వారి అవగాహన స్థాయిని పరీక్షించారు. సచివాలయాల్లో పౌరసేవలు సజావుగా సాగాలని, అందుకోసం కార్యాచరణ సిద్ధం చేశామని కమిషనర్‌ వివరించారు. ఆమె వెంట అదనపు కమిషనర్లు తమీమ్‌ అన్సారీయా, ఆర్‌.సోమన్నారాయణ, యూసీడీ పీడీ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T09:12:38+05:30 IST