వరి సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది: మారెడ్డి

ABN , First Publish Date - 2021-04-08T21:32:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల, ముందుచూపు, దార్శనికత వల్ల ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో వరి సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

వరి సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది: మారెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల, ముందుచూపు, దార్శనికత వల్ల ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో వరి సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ధాన్య సేకరణలో అపూర్వ ప్రగతిని సాధించిందని అన్నారు.గురువారం పౌరసరఫరాల భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 నుండి 2020-21 (వానాకాలం) వరకు ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 68వేలకోట్ల రూపాయల విలువ చేసే 3 కోట్ల 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది.


ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలో కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా యాసంగిలో కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి కానుంది. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం,యాసంగి రెండు సీజన్లు కలిపి రాష్ట్రంలో 2 కోట్ల 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుందని ఆయన వెల్లడించారు. ఇందులో స్థానిక అవసరాలు, లోకల్ మార్కెట్, సీడ్, తదితర అవసరాలకు పోగా మిగిలిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది.ఇప్పటికే వానాకాలంలో 48.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా యాసంగిలో 80 నుండి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాం, రెండు సీజన్లను కలిపి కోటి 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనబోతున్నామని తెలిపారు.


యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు 6575 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్థానిక అవసరాలను బట్టి అవసరమైతే అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.గత ఏడాది (2019-20)యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 6,500 కొనుగోలు కేంద్రాల ద్వారా64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండే విధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.

 



ఈ యాసంగి సీజన్ లో బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి మొదట్లో ఎఫ్ సిఐ అంగీకరించలేదు.తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ ఎఫ్ సిఐ ద్వారా వెళ్లేది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా వారికి అవసరమైన పంట దిగుబడి అవుతుంది. దీంతో ఎఫ్ సిఐ తమకు 'రా' రైస్ మాత్రమే కావాలి, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని స్పష్టం చేసింది.రైతాంగంపై ఉన్న మక్కువతో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బాయిల్డ్ రైస్ తీసుకునేలాఎఫిసిఐని ఈ సీజన్ వరకు ఒప్పించారని తెలిపారు.

Updated Date - 2021-04-08T21:32:47+05:30 IST