స్నేహం..అజరామరం అమృతం:పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డీటీ
ABN , First Publish Date - 2021-08-01T22:41:41+05:30 IST
యువత కు సరైన సమయంలో చక్కటి స్నేహం అనేది ఓ దిశా నిర్దేశం చేసే దిక్సూచి లా మార్గ దర్శనం చేస్తుందని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్, భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర
హైదరాబాద్: యువత కు సరైన సమయంలో చక్కటి స్నేహం అనేది ఓ దిశా నిర్దేశం చేసే దిక్సూచి లా మార్గ దర్శనం చేస్తుందని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్, భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విదార్ధి దశలోనే ఉత్తమ సాంగత్యం లభ్యమవ్వడం ఎంతో ఉపయుక్తం అవుతుందని పేర్కొన్నారు.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారాన్నది ఎంత వాస్తవమో,మిత్రుల ఉన్నతి కోరే స్నేహితులు లభించటం కూడా జీవితం లో ఎంత గానో లాభిస్తుందని అభిప్రాయ పడ్డారు. అందుకే విద్యార్థులు, యువత సాధ్యమైనంత మేరకు మేటీ స్నేహం కోరుకోవాలి అని సూచించారు. ఓ గొప్ప స్నేహితుడు చక్కటి పుస్తకం వంటి వారిని అభిప్రాయపడ్డారు.