ఆదివారం యాదాద్రిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-06-12T22:50:04+05:30 IST

సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రిని దర్శించుకోనున్నారు. సీజేఐ ఎన్వీ రమణతో

ఆదివారం యాదాద్రిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ

హైదరాబాద్: సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రిని దర్శించుకోనున్నారు. సీజేఐ ఎన్వీ రమణతో పాటు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీష్‌రెడ్డి పరిశీలించారు. భారత న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు.  సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.


శుక్రవారం ఎన్వీ రమణ కుటుంబంతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి కరుణ, కటాక్షాలతో, స్వామి ఇచ్చిన శక్తితో న్యాయవ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి, న్యాయవ్యవస్థ కీర్తిపతాకను గగన వీధుల్లో ఎగరవేయడానికి కృషి చేస్తానని ఎన్వీ రమణ చెప్పారు.

Updated Date - 2021-06-12T22:50:04+05:30 IST