రాయదుర్గం వాసికి సీజేఐ ప్రత్యుత్తరం
ABN , First Publish Date - 2021-06-13T08:31:52+05:30 IST
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన పురోహితుడు కె.రంగనాథశాస్త్రి పంపిన లేఖకు ప్రత్యుత్తరం పంపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
రాయదుర్గం, జూన్ 12: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన పురోహితుడు కె.రంగనాథశాస్త్రి పంపిన లేఖకు ప్రత్యుత్తరం పంపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్.వి.రమణకు రాయదుర్గానికి చెందిన రంగనాథశాస్త్రి శుభాకాంక్షలు తెలుపుతూ గత నెల 23న లేఖ పంపారు. 2014లో కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చినపుడు, శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు పొందిన సందర్భంలో తాను కలిసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అత్యున్నత పదవి అధిరోహించిన జస్టిస్ రమణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దీనికి స్పందిస్తూ జూన్ 6న ప్రధాన న్యాయమూర్తి తనకు లేఖ పంపినట్లు రంగనాథశాస్త్రి తెలిపారు.