ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత
ABN , First Publish Date - 2021-06-23T06:33:56+05:30 IST
: ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని మునిసిపల్ కమిషనర్ నాగేంద్రబాబు అన్నారు.
కోదాడ, జూన్ 22 : ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని మునిసిపల్ కమిషనర్ నాగేంద్రబాబు అన్నారు. పట్టణంలోని ఆరో వార్డులో కాలనీవాసులకు చెత్తబుట్టలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుప్రజలు ఇంటి వ్యర్థాలను ఆరుబయట వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. పారిశుధ్యంతోనే ఆరోగ్య పరిరక్షణ ఉంటుందని, ఆ దిశగా కాలనీవాసులు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, అంకుశ వలి, మాధవి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.