తెరపడుతోంది !

ABN , First Publish Date - 2021-04-22T06:46:14+05:30 IST

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు కొత్త సినిమాల రిలీజ్‌ కాక జిల్లాలోని థియేటర్లు మూతపడుతున్నాయి.

తెరపడుతోంది !

మూతపడుతున్న సినిమా థియేటర్లు


తిరుచానూరు, ఏప్రిల్‌ 21: ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు కొత్త సినిమాల రిలీజ్‌ కాక జిల్లాలోని థియేటర్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే తిరుపతి, మదనపల్లె, చిత్తూరుల్లో పలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌ సినిమా మాత్రం కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఇవి కాకుండా అక్కడక్కడా కొన్ని థియేటర్లలో సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయి. దీనికితోడు తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో అక్కడ థియేటర్లన్నీ మూతపడ్డాయి. కొత్త సినిమాల రిలీజు లేకపోవడంతో ఈనెలాఖరుకల్లా జిల్లావ్యాప్తంగా ఉన్న థియేటర్లు మూతపడతాయని ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-22T06:46:14+05:30 IST