ఎంపీటీసీలకు నిధులూ లేవు, విధులూ లేవు: భట్టి

ABN , First Publish Date - 2021-11-27T22:12:49+05:30 IST

రాష్ట్రంలోని ఎంపీటీసీలకు నిధులూ లేవు, విధులూ

ఎంపీటీసీలకు నిధులూ లేవు, విధులూ లేవు: భట్టి

ఖమ్మం: రాష్ట్రంలోని ఎంపీటీసీలకు నిధులూ లేవు, విధులూ లేవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ప్రచారంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పంచాయతీ రాజ్ వ్యవస్థపై ఎంపీటీసీలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా ఖమ్మం జిల్లా అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 




Updated Date - 2021-11-27T22:12:49+05:30 IST