వాక్సిన్‌తో కరోనా అంతం కావాలి

ABN , First Publish Date - 2021-01-17T05:11:59+05:30 IST

వాక్సిన్‌తో దేశంలో కరోనా అంతం కావాలని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా వాక్సిన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

వాక్సిన్‌తో కరోనా అంతం కావాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

 మధిరలో వ్యాక్సినషన్‌ కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క

మధిరటౌన్‌, జనవరి 16: వాక్సిన్‌తో దేశంలో కరోనా అంతం కావాలని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా వాక్సిన్‌  కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ 2020లో దేశంలో అందరినీ ఇబ్బంది పెట్టిందని, 2021లో దాని అంతం జరిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాక్సిన్‌ తీసుకున్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మొండితోక లత, వైస్‌ చైర్మన్‌ శీలం విద్యాలత, ఎంపీపీ లలిత, జిల్లా మలేరియా అధికారి సైదులు, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ రంగారావు, తహసీల్దార్‌ సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్‌ రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ డా.అనిల్‌కుమార్‌ ప్రజాప్రతినిధులు, ఇతర అదికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు.  


Updated Date - 2021-01-17T05:11:59+05:30 IST