సీఎం గెహ్లాట్ ఇంట్లో ప్రారంభమైన సీఎల్పీ సమావేశం
ABN , First Publish Date - 2020-07-13T16:54:27+05:30 IST
రాజస్థాన్లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో శాసనసభా పక్షం ప్రారంభమైంది.
జైపూర్ : రాజస్థాన్లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో శాసనసభా పక్షం ప్రారంభమైంది. అధిష్ఠానం దూత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో 10 మంది స్వతంత్రులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
మరోవైపు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్కు అత్యంత సన్నిహితుడైన ధనీశ్ అబ్రర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని స్వతంత్ర ఎమ్మెల్యే రమిలా ఖడియా ప్రకటించారు. తన తండ్రి వర్ధంతి కారణంగా హాజరు కాలేకపోతున్నానని, అయితే తన మద్దతు మాత్రం సీఎం గెహ్లాట్కే అని ప్రకటించారు.