ఊరి చివర ఇద్దరు కుర్రాళ్ల మృతదేహాలు.. ఫోన్ కాల్స్‌లో షాకింగ్ నిజాలు.. ఒకే అమ్మాయిని ప్రేమించారు.. కానీ..

ABN , First Publish Date - 2022-01-26T21:53:17+05:30 IST

తమ పిల్లలు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ఊరి చివర ఇద్దరు కుర్రాళ్ల మృతదేహాలు.. ఫోన్ కాల్స్‌లో షాకింగ్ నిజాలు.. ఒకే అమ్మాయిని ప్రేమించారు.. కానీ..

తమ పిల్లలు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ సాగించారు.. అయినా ఫలితం లేదు.. చివరకు ఊరి చివర రెండు కుక్కలు తవ్విన గుంత కారణంగా వారి మృతదేహాలు బయటపడ్డాయి.. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. అక్కడ దొరికిన మొబైల్ ఫోన్స్ ఆధారంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


గోరఖ్‌పూర్‌కు సమీపంలోని ఉందే గ్రామానికి చెందిన ఆకాష్, గణేష్ అనే యువకులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఈ నెల 7వ తేదీన వీరిద్దరూ అదృశ్యమయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడ్రోజుల అనంతరం గ్రామం చివర ఉన్న పొలంలో రెండు కుక్కలు గుంత తవ్వాయి. అక్కణ్నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా ఆకాష్, గణేష్ మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అక్కడ దొరికిన మొబైల్స్ లోని కాల్ లిస్ట్ చెక్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 


ఈ ఇద్దరు కుర్రాళ్లు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించినట్టు తేలింది. ఆ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారే ఈ ఇద్దరినీ చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ ఊరి చివరకు పిలిచి చంపేసి, మృతదేహాలను పూడ్చి పెట్టేసి ఉంటారని అనుకుంటున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువతిని, ఆమె బంధువులను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. 

Updated Date - 2022-01-26T21:53:17+05:30 IST