ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం యోగి

ABN , First Publish Date - 2020-12-01T05:00:53+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన నమామి...

ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం యోగి

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగానది ఇప్పుడు స్వచ్ఛంగా మారిందన్నారు. వారణాసిలో ఇవాళ జరిగిన దేవ్ దీపావళి కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ... ‘‘ఆరేళ్ల క్రితం ప్రజలు గంగానదిలో స్నానం చేయడానికి కూడా భయపడేవాళ్లు. రెండు రోజుల పాటు ఎవరైనా వరుసగా పవిత్ర స్నానం ఆచరిస్తే వాళ్లకు చర్మవ్యాధులు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రజలు ఈ నీటితో ఆచమనం చేసుకుంటున్నారు. గంగానదిని శుద్ధీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నమామి గంగే కార్యక్రమం ద్వారానే ఇది సాధ్యమైంది...’’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇవాళ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో జరిగిన దేవ్ దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:00:53+05:30 IST