నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యం
ABN , First Publish Date - 2020-05-24T10:56:16+05:30 IST
వ్యవసాయ రంగంలో నూతన విధానాన్ని తీ సుకురావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం, మే 23 : వ్యవసాయ రంగంలో నూతన విధానాన్ని తీ సుకురావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని నందిమేడారం, ఖిలావ నపర్తి, నర్సింహులపల్లి గ్రామాల్లో ఎస్సారెస్సీ కాల్వల పూడికతీత ప నులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ నూతన పద్ధతులతో వ్యవసాయం సాగు చేయడానికి ప్రభు త్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పద్మ జ, ఎంపీపీ కరుణశ్రీ, మార్కెట్ చైర్మన్ మోహన్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు వెంకట్రెడ్డి, బలరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ధర్మారంలో ఆశ్రయ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని 121 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులను మంత్రి అందజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.