బీజేపీ కర్ణాటకలోని అన్ని వర్గాల పార్టీ : సీఎం

ABN , First Publish Date - 2021-10-09T01:43:18+05:30 IST

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కర్ణాటకలోని అన్ని వర్గాల

బీజేపీ కర్ణాటకలోని అన్ని వర్గాల పార్టీ : సీఎం

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కర్ణాటకలోని అన్ని వర్గాల పార్టీ అని, ఇది కేవలం లింగాయత్‌లపై ఆధారపడిన పార్టీ కాదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, వక్కళిగలు కూడా బీజేపీకి మద్దతిస్తున్నారన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


బీజేపీ గురించి మాట్లాడేటపుడు ప్రధానంగా లింగాయత్‌ల మద్దతుగల పార్టీగా చెప్పడానికి కారణం అత్యధిక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్తర కర్ణాటక నుంచి గెలవడమేనని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు లేకపోతే, ఏ పార్టీ అయినా అధికారం చేపట్టడం సాధ్యం కాదన్నారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, వక్కళిగలు కూడా మద్దతిస్తున్నారన్నారు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ అన్ని వర్గాల పార్టీ అన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. ‘బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు’ అనేది తమ పార్టీ విధానమని చెప్పారు. దీనివల్ల దేశం బలోపేతమవుతుందన్నారు. పరిపాలన విషయానికి వస్తే, కొన్ని సందర్భాల్లో కేంద్రాన్ని రాష్ట్రాలు సంప్రదించవలసి ఉంటుందని, మరికొన్ని సందర్భాల్లో రాష్ట్రాలను కేంద్రం సంప్రదించవలసి ఉంటుందని చెప్పారు. 


బీఎస్ యడియూరప్ప తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని బసవరాజ్ బొమ్మయ్ చేపట్టారు. యడియూరప్ప ఒంటి చేత్తో కర్ణాటకలో బీజేపీని నిర్మించారని బొమ్మయ్ చెప్పారు. పార్టీకోసం ఆయన అనేక పోరాటాలు చేశారన్నారు. తదుపరి తరానికి యడియూరప్ప అవకాశం ఇచ్చారన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణను ఆయన మాత్రమే నిర్ణయించుకోగలరని చెప్పారు. 


Updated Date - 2021-10-09T01:43:18+05:30 IST