‘వైశ్య కార్పొరేషన్’ యోచనలో సీఎం: దామోదర్
ABN , First Publish Date - 2021-04-11T08:49:49+05:30 IST
రాష్ట్రంలో త్వరలో వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటుచేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటుచేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. దీని ద్వారా చిన్నచిన్న వ్యాపార సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారటు. పేద విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి కూడా కార్పొరేషన్ ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు.