సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్‌ టీం

ABN , First Publish Date - 2021-08-11T00:52:22+05:30 IST

సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్‌ టీం

సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్‌ టీం

అమరావతి: ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌‌లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం వైఎస్‌ జగన్ బ్రిటన్‌ టీంను కోరారు. ‌ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎంకి బ్రిటన్‌ టీం వివరించారు. డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించిన సీఎం జ్ఞాపిక అందజేశారు.

Updated Date - 2021-08-11T00:52:22+05:30 IST