అందరికీ సకల సౌభాగ్యాలు లభించాలి : వైఎస్ జగన్

ABN , First Publish Date - 2021-08-20T17:41:17+05:30 IST

శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం రోజున మహిళలందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అందరికీ సకల సౌభాగ్యాలు లభించాలి : వైఎస్ జగన్

అమరావతి : శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం రోజున మహిళలందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ శుభ శ్రావణ మాసంలో ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వత్రాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలు లభించాలి’ అని కోరుతూ ట్వీట్టర్‌లో జగన్ కోరుకున్నారు.

Updated Date - 2021-08-20T17:41:17+05:30 IST