సీఎం జగన్ పై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు
ABN , First Publish Date - 2020-08-15T23:24:21+05:30 IST
సీఎం జగన్ పై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నామని సీఎం జగన్ అంటున్నారని, ఇంకెన్నాళ్లు..ఇంకెన్నేళ్లు .? అని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి అబద్ధపు మాటలు, మోసపు వాగ్దానాలు చేస్తారా అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.