దళితుల హక్కులు కాలరాస్తున్న సీఎం జగన : టీడీపీ ఎస్సీ సెల్
ABN , First Publish Date - 2021-07-30T06:20:09+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దళితుల హక్కుల ను కాలరాస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు, మాజీ ఎంపీపీ మంజుళకొల్లప్ప వి మర్శించారు.
కళ్యాణదుర్గం, జూలై 29: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దళితుల హక్కుల ను కాలరాస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు, మాజీ ఎంపీపీ మంజుళకొల్లప్ప వి మర్శించారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ భవనలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రిపై వైసీపీ రౌడీలు దౌర్జన్యంచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అక్రమకేసు బనాయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు, సామాన్య ప్రజలకు రక్షణకరువైందని వాపోయారు. అధికార దర్పంతో వాహనాల అద్దాలు ధ్వంసంచేసి దాడికి పాల్పడిన మాజీ మంత్రి వర్గీయులే.. దాడిచేసినట్లు పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు బనాయించడం అప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. అనేక సంఘటనల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయిస్తూ రాజ్యాంగానే అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పెద్దన్న, హరి, ఎల్లయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.