జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-05-17T16:39:10+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది.

జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. 11 ఛార్జ్ షీట్లలో ఏ1 గా ఉన్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి త్వరితగతిన విచారణ చేయాలంటూ పిటిషనర్ రఘు రామ కృష రాజు కోర్టును కోరారు. బెయిల్ రద్దు అంశంపై సీబీఐ అధికారులు దాఖలు చేసే కౌంటర్ కీలకంకానుంది. జగన్, సీబీఐ అధికారులు కౌంటర్‌పై వాదనలు కొనసాగనున్నాయి. 

Updated Date - 2021-05-17T16:39:10+05:30 IST