బీసీల అభివృద్ధికి విప్లవాత్మక చర్యలు: జగన్
ABN , First Publish Date - 2021-11-25T01:13:32+05:30 IST
రాష్ట్రంలోని బీసీల బీసీల అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని
అమరావతి: రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై జగన్ను బీసీ నేతలు కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. వెనకబడిన తరగతులను వెన్నెముక కలిగిన వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని వారికి జగన్ సూచించారు.