ఆరోగ్యశ్రీలో కొవిడ్ వైద్యం: జగన్‌

ABN , First Publish Date - 2021-11-26T02:34:03+05:30 IST

పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడకుండా ఉండడానికే

ఆరోగ్యశ్రీలో కొవిడ్ వైద్యం: జగన్‌

అమరావతి: పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడకుండా ఉండడానికే కొవిడ్ వైద్యాన్ని వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కొవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలొచ్చినా దానిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. ఈ నెల 23 నాటికి 3.2 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు చేశామన్నారు. ఏపీలో కొవిడ్ వలన చనిపోయింది .07 శాతం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినా 93 శాతం మందిని కాపాడుకున్నామన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్‌ను ఓపెన్ చేశామని జగన్‌ తెలిపారు. 



Updated Date - 2021-11-26T02:34:03+05:30 IST