డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి సీఎం జగన్
ABN , First Publish Date - 2020-09-24T00:05:12+05:30 IST
వివాదాల మధ్య సీఎం జగన్ తిరుమల పర్యటన జరుగుతోంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే డిక్లరేషన్
తిరుమల: వివాదాల మధ్య సీఎం జగన్ తిరుమల పర్యటన జరుగుతోంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి జగన్ ప్రవేశించారు. అనంతరం శ్రీవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ నుదుట నామాలు పెట్టుకున్నారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొంటారు.