సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు

ABN , First Publish Date - 2021-12-24T17:36:46+05:30 IST

సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు బయటపడ్డాయి. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు

కడప : సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు బయటపడ్డాయి. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే జగన్, షర్మిళ, విజయమ్మ ఎవరికి వారుగా వేర్వేరుగా నివాళులర్పించారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు చెల్లెలు షర్మిళ, తల్లి విజయమ్మతో కలిసి రాకపోవడం గమనార్హం. తండ్రి వైఎస్ ఘాట్ వద్ద రాత్రి నివాళులర్పించి జగన్ వెళ్ళిపోయిన అనంతరం షర్మిళ, విజయమ్మ వచ్చారు. ఇడుపులపాయ చర్చిలో కూడా జగన్, విజయమ్మలు వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు. ఇడుపులపాయలో మొదటిసారిగా వైఎస్ కుటుంబంలో వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు.


Updated Date - 2021-12-24T17:36:46+05:30 IST