ఏపీ సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఇది..
ABN , First Publish Date - 2020-06-03T03:13:53+05:30 IST
గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే...
అమరావతి: గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 3,38,144 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రూ. 1,323 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో చేపట్టే 15 లక్షల గృహ నిర్మాణాల్లో విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు.
పడక గది, వంట గది, లివింగ్ రూం, వరండా లాంటి సదుపాయాలు ఉండాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వ పనులంటే నాసికరం అనే చెడ్డపేరు పోవాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు.