ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ABN , First Publish Date - 2021-04-16T22:47:31+05:30 IST
రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీకి 60 లక్షల వ్యాక్సిన్ డోసులు
విజయవాడ: రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీకి 60 లక్షల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని విజ్ఞప్తి జగన్ విజ్ఙప్తి చేశారు. టీకా ఉత్సవ్లో భాగంగా ఒకేరోజు 6 లక్షల 28 వేల డోసులు వేశామని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకే రోజు 6 లక్షల 28 వేల డోసులు వేయటంతో రాష్ట్రంలో డోసుల కొరత ఏర్పడిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో తగినంత సంఖ్యలో డోసులు కేటాయించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో రోజుకి 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళికలు రూపొందించామని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.