సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-10-18T13:41:29+05:30 IST

రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రభుత్వ ఆదాయంలో వాటా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు..

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రభుత్వ ఆదాయంలో వాటా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వలే సర్వ హక్కులు కలిగి, స్థానిక ప్రభుత్వ కేంద్రాలుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు ప్రజల నుండి వసూలు చేసే పన్నులను సిబ్బంది జీతభత్యాలకు, నిర్వహణకు వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. తత్ఫలితంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి అటకెక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగుల జీతాలను చెల్లిస్తున్నట్లుగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఉద్యోగుల జీత భత్యాలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కమిషన్ నిధులను డైరెక్ట్‌గా మున్సిపాలిటీలకు చెల్లించే విధంగా చూడాలని సీఎంను ఆయన కోరారు.

Updated Date - 2020-10-18T13:41:29+05:30 IST