సీఎం జగన్రెడ్డి... దళిత వ్యతిరేకి: ఎమ్మార్పీఎస్
ABN , First Publish Date - 2021-07-30T05:58:57+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిని ఏపీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తుంపర్తి రమేష్ విమర్శించారు.
గోరంట్ల, జూలై 29: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిని ఏపీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తుంపర్తి రమేష్ విమర్శించారు. గోరంట్లలోని సరస్వతి విద్యామందిరంలో గురువారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. పూర్వం పాలేగాళ్ల రాజ్యంలో భూములను లాక్కున్నారని, మళ్లీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో భూములను లాక్కొంటున్నారని వాపోయారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఉద్యమిస్తామన్నారు. అనంతరం సమావేశంలో దళితుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు బండి నరసింహులు, నాగప్ప, వెంకటరామప్ప, బాట గంగప్ప, ఆదినారాయణ, మల్లేశ్వరప్ప, గంగులప్ప, మిద్దె వెంకటరామప్ప, నాగలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.