జగన్‌ ‘టార్గెట్‌ పాలిట్రిక్స్‌’ సరికాదు

ABN , First Publish Date - 2021-04-19T09:56:33+05:30 IST

జగన్‌ ‘టార్గెట్‌ పాలిట్రిక్స్‌’ సరికాదు

జగన్‌ ‘టార్గెట్‌ పాలిట్రిక్స్‌’ సరికాదు

జడ్జి రామకృష్ణపై రాజద్రోహం కేసు ఎత్తివేయాలి: రామకృష్ణ


విజయవాడ సిటీ, ఏప్రిల్‌ 18: ‘‘ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ టార్గెట్‌ పాలిట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. తిరుపతి ఎన్నికలో దొంగ ఓటర్లను తెచ్చి అప్రజాస్వామికంగా వ్యవహరించారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. జగన్‌ అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, టార్గెట్‌ పేరుతో అత్యంత ప్రమాదకరమైన ఆటను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, బెంగళూరుల నుంచి పెద్దఎత్తున దొంగ ఓటర్లను తిరుపతికి తరలించి ప్రజాస్వామ్యాన్ని జగన్‌ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు.   రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. జడ్జి రామకృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టడాన్ని ఖండించారు.  

Updated Date - 2021-04-19T09:56:33+05:30 IST