బస్సు ప్రమాద ఘటనపై CM Jagan దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
ABN , First Publish Date - 2021-12-15T20:00:42+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సీఎం జగన్ ఆదేశించారు.