సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని కామెంట్స్..

ABN , First Publish Date - 2020-06-02T23:24:56+05:30 IST

సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని కామెంట్స్..

సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని కామెంట్స్..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి వందలాది ప్రొక్లైన్‌లతో వేలాది లారీలతో ఇసుకను తరలించారని ఉమ విమర్శించారు. ఇసుక ఎలా తరలించారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల నుంచి 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేశారని ట్విట్టర్‌లో దేవినేని ఉమ పేర్కొన్నారు. లక్షల టన్నుల ఇసుక మార్గ మధ్యలో మాయమైందని మీ వాళ్లే చెబుతున్నారని, దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ అన్నారు.


Updated Date - 2020-06-02T23:24:56+05:30 IST