కాసేపట్లో ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం
ABN , First Publish Date - 2020-09-24T20:15:38+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నోటరీ జీవోలు 58, 59 పరిధిలోని.. పేదలకు ఉచితంగా క్రమబద్దీకరణ అంశంపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదుపై ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.