నిధులు రాష్ట్రాల హక్కు.. కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదు: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-10-01T21:23:15+05:30 IST
హైదరాబాద్: నిధులు రాష్ట్రాల హక్కని, కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: నిధులు రాష్ట్రాల హక్కని, కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నిధులు లేక సర్పంచులు దివాలా తీశారని, కాంగ్రెస్ హయాంలో అంత్యక్రియలకు కూడా స్థలం చూపలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు పూర్తిగా చెల్లించామని చెప్పారు. అఖిలపక్షం వస్తే రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదామన్నారు. కాంగ్రెస్ సభ్యుల నియోజకవర్గాల్లోని పల్లెల్లో పరిస్థితులను పరిశీలిద్దామన్నారు. దేశంలో ఎక్కడాలేని వికాసం తెలంగాణలోనే జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 24 వరకు మ్యాచింగ్ గ్రాంట్లు పూర్తిగా చెల్లించామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీల లెక్కల వివరాలు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.