మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరం: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-26T00:53:43+05:30 IST

మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరియమ్మ లాకప్‌

మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరం: సీఎం కేసీఆర్‌

 హైదరాబాద్: మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరియమ్మ లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే లాకప్‌డెత్‌కు కారణమైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడు ఉదయ్‌కి ప్రభుత్వ ఉద్యోగం, గృహంతో పాటు 15 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అలాగే మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షలు ఇవ్వాలని సీఎస్‌కు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-06-26T00:53:43+05:30 IST