గవర్నర్ మాతృమూర్తి మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2021-08-18T14:29:43+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి మృతితో గవర్నర్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని రాజ్భవన్లో ఉంచనున్నారు. అనంతరం ఆంత్యక్రియల కోసం చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.