తెలంగాణ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై
ABN , First Publish Date - 2021-08-22T13:13:07+05:30 IST
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సహోదరత్వానికి
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.