ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-01-28T00:22:03+05:30 IST

గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని గురువారం సీఎం కేసీఆర్ అభినందించారు.

ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని గురువారం సీఎం కేసీఆర్ అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్ తో  కలిసి సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో  మర్యాద పూర్వకంగా కలిసారు. గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఇగురం రచయితవు కదా చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి అభినందించారు., సీఎం కేసీఆర్ తనని గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని స్వయంగా ఆయనే తనతో ప్రస్థావించడంతో తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు, 


తన తొలి పుస్తకం ఇగురం సీఎం కేసీఆర్ వరకూ చేరడం, ఆయన దాన్ని చదవడం అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని, గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. ఈ సందర్బంగా సీఎం  కేసీఆర్ ని తను కలువడానికి కారణమైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, అభినందించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, మానేరు గడ్డపై పుట్టడం, హైదరాబాద్ విబిన్న సంసృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంబణ అని మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి గంగాడి సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ణతలు తెలపారు.

Updated Date - 2022-01-28T00:22:03+05:30 IST