మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-07-05T01:25:28+05:30 IST

రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు.

మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ లేఖ పంపించడంతో పాటు ఫోన్‌చేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు. అలాగే  శాసన మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఎర్రబెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రజల నేతగా కొనసాగుతున్న ఎర్రబెల్లి ప్రజల మనిషిగా మంచిపేరు తెచ్చుకున్నారని వారు ప్రశంసించారు. కాగా శనివారం ఉదయమే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా మంత్రి ఎర్రబెల్లికి ఫోన్‌ ద్వారా  శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంత్రలు సత్యవతి రాధోడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోన్‌చేసి శుభాకాంక్షలుచెప్పారు. 


ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు కూడా ఎర్రబెల్లికి శుభాకాంక్షలుచెప్పారు. ఇలా ఉండగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసైసౌందరరాజన్‌, సీఎంకేసీఆర్‌, మండలి ఛైర్మన్‌, శాసన సభ స్పీకర్‌, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-07-05T01:25:28+05:30 IST