ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-06-21T16:44:44+05:30 IST

ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీ పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ తద్వారా ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-21T16:44:44+05:30 IST