ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర: KCR
ABN , First Publish Date - 2021-12-18T17:45:15+05:30 IST
ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో సీజేఐ ఎన్వీ రమణ ఒకరని తెలిపారు. ఐఏఎంసీ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనేక అంశాల్లో హైదరాబాద్ త్వరలోనే నెంబర్వన్ కాబోతోందని కేసీఆర్ అన్నారు.