మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-01-19T19:18:20+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆయన...

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

మేడిగడ్డ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆయన మేడిగడ్డ రిజర్వాయర్‌కు చేరుకున్నారు. అక్కడ పనులు పురోగతి నుంచి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. స్థానిక అధికారులతోపాటు ఉన్నతాధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.


మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కాలేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. తర్వాత సీఎం కేసీఆర్ మేడిగడ్డ రిజర్వాయర్‌కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి సాయంత్రం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-19T19:18:20+05:30 IST